రతన్ టాటా
రతన్ టాటా రతన్ టాటా, టాటా గ్రూప్ సంస్థల నాయకత్వం చేపట్టిన సమయంలోనే భారత్ ఆర్ధిక సరళీకరణ బాట పట్టింది. అది 1991. అలా రతన్ టాటా నేతృత్వంలో టాటా సామ్రాజ్య విస్తరణ, భారత ఆర్థిక వ్యవస్థ విస్తరణ రైలు పట్టాలుగా ఒకదాని వెంట ఒకటి సాగిపోయాయి అనుకోవచ్చు. పరస్పర పూరకాలు అనుకోవచ్చు. దేశీయ దృష్టి మాత్రమే హెచ్చుగా ఉన్న కంపెనీల్లో సంప్రదాయ నాయకత్వాన్ని, సంప్రదాయ ఆలోచనా విధానాన్ని తొలగించి.. విస్తారమైన కొత్త ఆలోచనా విధానాన్ని నెలకొల్పి.. సంస్థను అనూహ్యమైన స్థాయికి విస్తరించిన పారిశ్రామిక వేత్తగా ఇవాళ ఆయన్ను అందరూ గుర్తిస్తున్నారు. కీర్తిస్తున్నారు. విస్తరణ అనేది వ్యాపారంలో ఎంత కీలకమైన అంశమో గుర్తించి, అందివచ్చిన అవకాశాలను ఉపయోగించుకుని సంస్థలను అందనంత ఎత్తుకు తీసుకువెళ్లిన ఇండస్ట్రియల్ లీడర్ రతన్ టాటా. రతన్ టాటా 1991 నుంచి 2012 వరకూ టాటా సంస్థలకు నాయకత్వం వహిస్తే ఈ కాలంలో టాటా గ్రూప్ సంపద 40 రెట్లు పెరిగింది. లాభం 50 రెట్లు పెరిగిందని ఆర్థిక నిపుణుల అంచనా. కొన్ని పరాజయాలు, ప్రతికూల అంశాలున్నప్పటికీ ఎక్కువగా సానుకూల అంశాలతోనే వార్తల్లో ఉండే ఇండస్ట్రియల్ లీడర్ రతన్ టాటా. బ్రిటన్ సంస్థలను కొనడం ద్వార...